- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అదేంటి..గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ ఏ.రేవంత్రెడ్డి కలిశాడునుకుంటున్నారా? అవునండీ..నిజమే. అందుకు సాక్ష్యం వారు దిగిన ఫొటోనే. ఇవాళ జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో సర్వీసు ప్రారంభోత్సవంలో కేసీఆర్ పక్కనే ఎంపీ రేవంత్ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేస్తుండగా, ఓ వైపు మంత్రి కేటీఆర్, మరో వైపు రేవంత్ రెడ్డి నిల్చున్నారు. మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ హోదాలో రేవంత్ను కూడా ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే, ఎంపీ రేవంత్రెడ్డి గులాబీ పార్టీ, కేసీఆర్, కేటీఆర్లపై ఎన్నికల సందర్భంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.