కవితను గెలిపించుకోలేని కేటీఆర్‌కు సిగ్గుండాలి.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by  |
Revanth KTR
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్‌లో సొంత చెల్లెను గెలిపించుకోలేని కేటీఆర్‌కు సిగ్గుండాలి అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భరితెగించిన కోడి బజార్లో గుడ్డుపెట్టినట్టు కేసీఆర్ తనయుడు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చర్చలకు సిద్ధం అంటోన్న కేటీఆర్ తన ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. అభివృద్ధి నుంచి సంక్షేమ పథకాల వరకు ఏ అంశం పైన అయినా చర్చలకు తాను సిద్ధమన్నారు. ఇందుకు కేటీఆర్‌ సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. మా పార్టీ సీనియర్లపై మాట్లాడే హక్కు మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు. ముందు కేటీఆర్‌ శాఖలో జరుగుతున్న భాగోతాలను పట్టించుకోవాలని చురకలు వేశారు.

త్వరలోనే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఎందుకు వచ్చిందో చెప్పాలని.. అనుకున్నట్టుగానే రాష్ట్రం ఏర్పాటు తర్వాత పథకాలు అమలులోకి వచ్చాయనేది చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ఎజెండా ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది అనే దానిపై తాను బహిరంగ చర్చలకు సిద్ధమే.. ఇందుకు కేటీఆర్ సిద్ధమో కాదో తేల్చుకోవాలన్నారు. ఎవరూ చర్చల్లో విఫలమైనా రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాదు.. ఎటువంటి సవాళ్లకైనా రెడీగా ఉన్నానంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Next Story