- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రికార్డు ధర పలికిన మిర్చి.. ఏకంగా రూ.20 వేలు

దిశ ఖమ్మం టౌన్: ఈ ఏడాది మొదట్లో మిరప రైతులకు నిరాశ ఏర్పడింది. గత ఏడాదిలో మిర్చి ధర ఎక్కువగా పెరగటంతో జిల్లాలో రైతులు మిర్చి పంటకు ఆసక్తి చూపారు. ఈ ఏడాది దిగుబడి ఎక్కువ రావడం, కరోనా కారణంతో దేశీయ మార్కెట్లో మిర్చికి డిమాండ్ తగ్గిందని వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. దీంతో రైతులు కోల్డ్ స్టోరేజ్ లో దాచుకోవడం మొదలయింది. ఇది గమనించిన కొంతమంది వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోళ్లు చేసి వారుకుడా స్టోరేజ్ లలో నిల్వ ఉంచారు. కానీ వారికి సరైన సమయంలో ధర పెరగకుండా మందగించడంతో దిగాలు తీసిన రైతులకు, ఇటు వ్యాపారులకు డిసెంబర్ నెల కలిసొచ్చింది. గత రెండు మూడు రోజులుగా ఒక్కసారిగా ఏసీ మిర్చి ధర పెరుగుతూ వచ్చింది. కానీ సోమవారం మాత్రం ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ఏసీ మిర్చి ధర రూ. 20వేల మార్కు ను దాటింది. కానీ మార్కెట్ లో మాత్రం రూ.19 వేలకు కొనుగోలు చేయడం గమనించాల్సిన విషయం.