గిరిజన IIT విద్యార్థినికి అండగా నిలిచిన రవి ఫౌండేషన్

by  |
గిరిజన IIT విద్యార్థినికి అండగా నిలిచిన రవి ఫౌండేషన్
X

దిశ, మిర్యాలగూడ : మండలంలోని బద్యా తండాకు చెందిన హమాలి కుమార్తే పావనికి జోధ్‌పూర్ ఐఐటిలో సీటు వచ్చింది. ఆర్థిక స్తొమత లేక ఇబ్బందులు పడుతున్న పావనికి మిర్యాలగూడకు చెందిన రవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పాదూరి రవికాంత్ రెడ్డి సోమవారం రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. ఉన్నత విద్యలో రాణించేందుకు ఫౌండేషన్ తరఫున అండగా నిలుస్తామన్నారు.



Next Story