- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ మెడికల్కాలేజీ ప్రిన్సిపాల్గా ప్రస్తుతం టెంపరరీ డీఎంఈగా కొనసాగుతున్న డాక్టర్ రమేష్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు మరో 30 మంది ప్రొఫెసర్లకు అడిషనల్ డీఎంఈలుగా పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు వీరికి బాధ్యతలు అప్పగిస్తూ హెల్త్ సెక్రటరీ రిజ్వీ మంగళవారం జీఓ జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రిన్సిపాల్గా, దాని అనుబంధ ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లుగా పోస్టింగ్లు ఇచ్చారు. అయితే డీపీసీ(డీపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) పూర్తైనా నాలుగు నెలలు తర్వాత పదోన్నతులు పొందిన వారికి పోస్టింగులు ఇవ్వడం గమనార్హం.
ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నాలుగు సార్లు అడిషనల్డీఎంఈల ప్రమోషన్లు జరుగుగా, స్వరాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ పదోన్నతులపై కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఎన్ని అడ్డంకులు తీసుకువచ్చినా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు ప్రత్యేక చొరవతో ప్రమోషన్లు వచ్చాయని మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రమేష్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.