వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం: రాజాసింగ్

by  |
Rajasinghe
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే రాజాసింగ్ జోస్యం చెప్పారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రీయ సేవా సంఘ్ సమావేశాన్ని వివాదాస్పదం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ధర్మాన్ని కాపాడేందుకు మాత్రమే సంఘ్ సమావేశాలు జరుగుతాయని స్పష్టం చేశారు. నైజాం చరిత్రను రూపుమాపుతాం అని పునరుద్ఘటించారు. హైదరాబాద్ పేరు మాత్రమే కాదు నైజాం దాడి జరిగిన ప్రతి ప్రాంతం పేర్లు మారుస్తామని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed