- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, గద్వాల : ‘రైతన్న’ సినిమాను వీక్షించాలని దర్శక, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డిని కలిసి కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నారాయణ మూర్తి ఎమ్మెల్యేను కలిశారు. తెలంగాణలో రైతులకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, రైతుల అభివృద్ధి, రైతుల స్థితిగతులు తదితర అంశాలపై రైతన్న సినిమా నిర్మించామని ఎమ్మెల్యకు వివరించారు. గద్వాలలోని నవరంగ్ థియేటర్లో ఈ నెల 12 నుంచి వారం రోజులు పాటు రైతన్న సినిమాను ప్రదర్శిస్తామని, దానికి సహకరించాలని ఆర్.నారాయణ మూర్తి ఎమ్మెల్యేను కోరారు.
ఆర్.నారాయణ మూర్తి అభ్యర్ధనకు ఎమ్మెల్యే కృష్ణమెహన్ రెడ్డి సానుకుూలంగా స్పందించారు. రైతన్న సినిమాను నడిపించేందుకు థియేటర్ల యాజమాన్యంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. తాను కూడా రైతులతో కలిసి రైతన్న సినిమాను చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆర్.నారాయణ మూర్తిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, గట్టు ఎంపీపీ విజయ్, జడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, కృష్ణ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.