- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. సాంగ్స్, ట్రైలర్తో ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్న సినిమా.. ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్లోనూ తగ్గేదే లే! అన్నట్టుగా దూసుకుపోతోంది. బన్నీ కెరీర్లో మొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో విడుదలతున్న ‘పుష్ప’.. ఐదు భాషల్లో ప్రీమియర్ అండ్ డిజిటల్ రైట్స్తో కలిపి ఏకంగా రూ. 250 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి పాండమిక్ కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల విషయంలో విధించిన నియంత్రణ పెద్ద సినిమాల బిజినెస్పై దెబ్బకొట్టింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ‘పుష్ప’ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుండగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ పేరుతో ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.