సర్పంచ్ కుర్చీలో ఎంపీపీ.. కలెక్టర్‌కు ఫిర్యాదు

by  |
సర్పంచ్ కుర్చీలో ఎంపీపీ.. కలెక్టర్‌కు ఫిర్యాదు
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం
కల్యాణపురం గ్రామపంచాయతీలో సర్పంచ్ భూక్యా బుజ్జికి ఘోర అవమానం ఎదురైంది. ఆదివారం అశ్వాపురం మండల ఎంపీపీ ముత్తునేని సుజాత కల్యాణపురం గ్రామపంచాయతీలో ఎఫ్ఆర్సీ కమిటీ నియామకాల కోసం సర్పంచ్ కార్యాలయానికి విచ్చేశారు. అయితే ఈ క్రమంలో ఎఫ్ఆర్సీ కమిటీ నియామకాలలో భాగంగా సర్పంచ్ కూర్చునే కుర్చీలో ఎంపీపీ కూర్చోవడం మండలంలో కలకలం రేపింది.

భూక్యా బుజ్జి గిరిజన సర్పంచ్ కావడంతో ఎంపీపీ సర్పంచ్ ని అవమానించిందనే ఆరోపణలు మండలంలో బలంగానే వినిపిస్తున్నాయి. సర్పంచ్ కుర్చీలో ఎంపీపీ కూర్చోవడం ఏంటని ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు.
మహిళా సర్పంచ్ భూక్యా బుజ్జి కుర్చీలో ఎంపీపీ కూర్చోవడంతో సర్పంచ్ కి అవమానం జరిగిందని కార్యాలయ కుర్చీ సాక్షిగా తేటతెల్లమౌవుతోంది. సర్పంచ్ భూక్యా బుజ్జి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెల్లుతారనే వదంతులు కూడా బాగానే వినిపిస్తున్నాయి. పినపాక నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు ప్రోటో కాల్ పాటించకుండా అవమానిస్తున్నారని,కొందరైతే పదవులకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. కొందరు వ్యక్తులు గిరిజన వ్యక్తుల పదవిని చూసి అవమానిస్తున్నారనే ఆరోపణలు నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఎంపీపీ ముత్తునేని సుజాతపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు,ప్రముఖమేధావులు కోరుతున్నారు. మరి జిల్లా కలెక్టర్ ఎంపీపీపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే



Next Story