- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని నా సోదరీ మణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు అద్భుతమైన నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. కాగా, ప్రధాని మోడీ ఏపీ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.
— Narendra Modi (@narendramodi) November 1, 2021
అంతేగాకుండా.. ఏపీలో పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పొట్టిశ్రీరాములు గారి ఆత్మార్పణ ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. అదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
- Tags
- Andhra Pradesh