శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట

by Sridhar Babu |
శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండలం, రుద్రాక్షపల్లి గ్రామంలో శ్రీ దాసరి మాధవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో, రుద్రాక్షపల్లి గ్రామ ప్రజలు, శ్రీ సాయిబాబా భక్తులు నిర్మించుకున్న శ్రీ సాయిబాబా మందిరంలో శ్రీ సాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం తేదీ:7-12-2021 నుండి ప్రారంభం అయ్యి 8-12-2021 ఉదయం 8:28 నిమిషాలకు ప్రతిష్టచనున్నారు.

ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో ఉదయం తీర్థప్రసాద వితరణ జరుగును. ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అథిధులుగా స్థానిక శాసనసభ్యులు శ్రీ సండ్ర. వెంకటవీరయ్య గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ మువ్వా. విజయ్ బాబు గారు, శ్రీ మట్టా. దయానంద్ గారు, పురప్రముఖులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో తేదీ 8-12-21న బుధవారం మధ్యాహ్నం 12:30నిమిషాల నుండి తీర్ద ప్రసాద వితరణ , మహా అన్నదాన కార్యక్రమం జరుగును. కావున రుద్రాక్షపల్లి గ్రామ ప్రజలు, సాయిబాబా భక్తులు, పురప్రముఖులు, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని గ్రామ ఆలయ కమిటీ వారు తెలియచేసినారు.



Next Story

Most Viewed