కవల పిల్లలకు తల్లి అయిన నటి.. ట్విట్టర్ వేదికగా వెల్లడి

by  |
prithi-zinta
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయింది. ఈ హ్యాపీ న్యూస్‌ను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్న నటి.. ‘అందరికీ హాయ్.. నేను ఈ రోజు మీ అందరితో ఓ సంతోషకరమైన వార్త పంచుకోవాలనుకుంటున్నాను. మాకు కవల పిల్లలు పుట్టారని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ఈ మంచి తరుణంలో మా హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. మా కుటుంబంలోకి జై జింటా గుడ్ ఎనఫ్, జియా జింటా గుడ్ ఎనఫ్‌లకు స్వాగతం’ అంటూ తన భర్త జీన్ గుడ్ ఎనఫ్‌తో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసింది. తమ జీవితంలోని ఈ కొత్త దశతో పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమన్న నటి.. డాక్టర్లు, నర్సులు, తమకు గర్భం అద్దెకు ఇచ్చిన వారికి రుణపడి ఉంటామని చెప్పింది. ఇక ఈ గుడ్ న్యూస్‌పై స్పందించిన శిల్పాశెట్టి.. ‘ఈ గొప్ప వార్త విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రియ నేస్తమా హృదయపూర్వక అభినందనలు’ అని తెలిపింది. అలాగే నర్గీస్ ఫక్రీ, రకుల్ ప్రీత్‌సింగ్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు ఇన్‌స్టా‌గ్రామ్‌ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Next Story

Most Viewed