గర్భిణితో సహా చిన్నారి ప్రాణాలు తీసిన లాక్‌డౌన్

by  |
గర్భిణితో సహా చిన్నారి ప్రాణాలు తీసిన లాక్‌డౌన్
X

దిశప్రతినిధి, హైదరాబాద్ : కరోనా నివారణకు విధించిన లాక్‌డౌన్‌ వలన ఓ నిండు గర్భిణితో పాటు కడుపులోని శిశువు కూడా మరణించింది. వివరాల్లోకివెళితే.. నాచారం మల్లాపూర్‌కు చెందిన పావని (28) నిండు గర్భిణి. శుక్రవారం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తీసుకువెళ్లారు.

ఎక్కడ తిరిగినా వైద్యం అందకపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది. చివరి నిమిషంలో సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి ఉదయం 11.30 గంటల సమయంలో తీసుకు వస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచింది. అంబులెన్స్‌లో ఆమె హాస్పిటల్‌కు చేరుకోగా వైద్యులు వెంటనే పరీక్షలు చేశారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పావని కడుపులోని శిశువు కూడా లోకం చూడకుండానే తల్లి కడుపులోనే చనిపోవడం అక్కడున్న వారినందరినీ కలచి వేసింది.


Next Story