‘పోసాని మురళి కృష్ణ ను కఠినంగా శిక్షించాలి’

by  |
‘పోసాని మురళి కృష్ణ ను కఠినంగా శిక్షించాలి’
X

దిశ, తొర్రూరు : పవన్ కల్యాణ్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న పోసాని మురళి కృష్ణ ను కఠినంగా శిక్షించాలని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు చాంద్ పాషా డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో పోసాని మురళి కృష్ణ పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రేగూరి సాయి కిరణ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చాంద్ పాషా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి కుటుంబాన్ని విమర్శించిన పోసాని మురళి కృష్ణ ను తెలంగాణ నుండి తరిమికొట్టాలి కోరారు.

ఇలాంటి వ్యక్తులను కఠినమైన శిక్ష విధించాలన్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి తపన పడుతున్న పవన్ కల్యాణ్ తన సినిమాను ఆపిన పర్వాలేదు ఇండస్ట్రీని కాపాడండి అని అనడం తప్పా అని ప్రశ్నించారు. ఎవరైనా పవన్ పై నోరు జారితే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పవన్ అభిమానులు జక్కుల శంకర్, ఎండి మాలిక్, సతీష్, అశోక్, నరేష్, వెంకటేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు


Next Story