- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పొంగులేటికి అరుదైన గౌరవం..

దిశ ప్రతినిధి, ఖమ్మం :
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులు ,మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. సుదీర్ఘ కాలంగా రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొంటున్న సుధాకర్ రెడ్డి సేవలను ఢిల్లీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ విచార్ మంచ్ గుర్తించింది. ఈ మేరకు ఆయన్ను పండిట్ చంద్రశేఖర్ ఆజాద్ మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేసింది. అలాగే, ఢిల్లీకి చెందిన ఇంద్రప్రస్థ శిక్ష ఇవాం తేల్ వికాస్ సంఘటన సంస్థ, పండిట్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్మృతి పురస్కారానికి ఎంపిక చేసింది. అయితే, పొంగులేటి ఒకేసారి రెండు పురస్కారాలు అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సుధాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరోనా కారణంగా వెంటనే పురస్కారాలు అందుకోలేక పోతున్నామని, త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందుకోనున్నట్లు పొంగులేటి సుధాకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.