కాంగ్రెస్ పార్టీ పై విజయసాయిరెడ్డి సెటైర్..

by Disha Web Desk 16 |
కాంగ్రెస్ పార్టీ పై విజయసాయిరెడ్డి సెటైర్..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కేరళ లో కొనసాగుతున్నది. అయితే పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలని 8 రాష్ట్రాల పీసీసీ కమిటీలు తీర్మానాలు కూడా చేశాయి. అయినా రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి రేసులో ఉండటానికి ఉత్సాహంగా లేరు. దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలు సెటైర్స్ వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ.. '' కాంగ్రెస్ పార్టీ ని నడపడానికి రాహుల్ గాంధీ వచ్చేంత వరకు మరో తాత్కాలిక అధ్యక్షుడి కోసం వెతకాల్సిందే.. ఏ పార్టీకి 2 అధికార కేంద్రాలు ఉండవు. పీవీ నర్సింహారావు గారికి చేసిన ట్రీట్‌ను తెలుగు ప్రజలు మర్చిపోలేరని'' ట్వీట్ లో పేర్కొన్నారు.


Next Story

Most Viewed