- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బండి సంజయ్ కీలక నిర్ణయం.. ఆ నియోజకవర్గాలపై ఫోకస్
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ బీజేపీ ఆ దిశగా స్పీడ్ పెంచుతోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులను అంచనా వేసుకుని చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై నివేదికలను పార్టీ పెద్దలకు చేరవేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం స్టేట్ చీఫ్ బండి సంజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జి.ప్రేమేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు నియోజకవర్గాల వారీగా బీజేపీ ఫోకస్ పెట్టింది. పలు నివేదికలను తెప్పించుకుంటున్న జాతీయ నేతలు అవసరమైన సూచనలు చేస్తున్నట్లు రాష్ట్ర రాజకీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ నియోజవర్గాలకు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను నియమించడం ద్వారా మరింత దూకుడు పెంచాలని నిర్ణయించినట్లు స్పష్టం అవుతోంది.
నూతనంగా నియమితులైన తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లకు శుభాభినందనలు💐 pic.twitter.com/QPmSTVD0x0
— BJP Telangana (@BJP4Telangana) September 19, 2022