- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఎట్టకేలకు నిర్భయదోషులకు శుక్రవారం ఉరిశిక్ష అమలు చేయటంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో పలువురు సెలబ్రెటీలు స్పందిస్తూ ఆలస్యమైనా న్యాయం గెలిచిందంటూ ట్వీట్లు చేస్తున్నారు. ధర్మసంస్థాపనాయ సంభావియుగే యుగే.. ఏడేళ్ల శని వొదిలిందని..చరిత్రలో నిర్భయ, దిశ మళ్లీ పునరావృతం కాకూడదు జైహింద్ అంటూ కొందరు ట్వీట్ చేశారు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై ప్రధాని మోడీ ట్విట్టర్లో స్పందించారు. దోషులకు శిక్షపడటంలో ఆలస్యం జరిగినా చివరకు న్యాయం జరిగిందనీ, మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దేశంలో నారీ శక్తి ప్రతి రంగంలోనూ రాణిస్తోందనీ, మనమంతా కలిసికట్టుగా మహిళా సాధికారతపై దృష్టి కేంద్రీకరించి దేశాన్ని నిర్మించాలని, అటువంటి సమానత్వం, అవకాశాలకు ప్రాధాన్యత ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.
Next Story