- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇవాళ విద్యాశాఖ అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. విద్యార్థుల జీవితాలను పరిగణలోకి తీసుకుని సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో CBSE పరీక్షలను వాయిదా వేసే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కరోనా వల్ల గత సంవత్సరం కొన్ని సబ్జెక్టుల CBSE పరీక్షలను కేంద్రం ప్రభుత్వం వాయిదా వేసింది. అలాగే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ఈ ఏడాది కూడా సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసే అవకాశముందని వార్తలొస్తున్నాయి.
- Tags
- trending news