మోదీ కీలక భేటీ.. CBSE పరీక్షలు వాయిదా?

by  |
మోదీ కీలక భేటీ.. CBSE పరీక్షలు వాయిదా?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇవాళ విద్యాశాఖ అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. విద్యార్థుల జీవితాలను పరిగణలోకి తీసుకుని సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో CBSE పరీక్షలను వాయిదా వేసే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కరోనా వల్ల గత సంవత్సరం కొన్ని సబ్జెక్టుల CBSE పరీక్షలను కేంద్రం ప్రభుత్వం వాయిదా వేసింది. అలాగే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేసే అవకాశముందని వార్తలొస్తున్నాయి.


Next Story

Most Viewed