బ్రిగేడియర్ వీరేంద్ర కుమార్ లేఖ కోటి ఇచ్చేలా చేసింది: పవన్

by  |

బ్రిగేడియర్ వీరేంద్ర కుమార్ రాసిన లేఖ తనను కదిలించిందని ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఢిల్లీలోని ఆర్కేపురం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి వెళ్లిన పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జీతో పవర్ స్టార్‌ను సైనికాధికారులు గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనిక్ బోర్డుకి సహాయం చేయాలంటూ బ్రిగేడియర్ వీరేంద్ర కుమార్ రాసిన లేఖే తనను కదిలించిందని తెలిపారు. గత పర్యటనలోనే ఈ విరాళం అందించాలని భావించినప్పటికీ కుదర్లేదని పవన్ చెప్పారు. దేశాన్ని, సైనికులను ప్రేమించే ప్రతి ఒక్కరూ సైనిక్ బోర్డుకి సాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ సాయం సైనిక కుటుంబాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ప్రసంగించనున్నారు.


Next Story