- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై, నేతల ఇంటిపై దాడిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖండించారు. జనసేన పార్టీ ఐటీ వింగ్ సమావేశంలో ఉన్న పవన్ కల్యాణ్ ఈ దాడుల విషయం తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి సరికాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ దాడులకు జనసేన పార్టీ తీవ్ర వ్యతిరేకమన్నారు. విజయవాడ, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయాలపైనా.. విశాఖ, ప్రొద్దుటూరులో టీడీపీనేతలు, పట్టాభి ఇంటిపై దాడి సరికాదన్నారు. వ్యక్తిగత దాడులు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు కేంద్ర హోంశాఖ ఈ దాడులపై దృష్టి సారించాలన్నారు. లేని పక్షంలో అరాచకాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్గా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ దాడులు వైసీపీ శ్రేణులు పనేనని సమాచారం అందుతుందన్నారు. ఇలాంటి సంస్కృతి సరికాదని వైసీపీకి సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రజల పక్షాన జనసేన పోరాటం చేస్తుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
- Tags
- Pawan Kalyan