- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వెబ్డెస్క్: తనపై విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని హితవు పలికారు.
పవన్ కల్యాణ్ వేసే వేషాల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. తామెంత ఓర్పుగా ఉన్నామో ఎన్నికలముందు చూశారు ఎన్నికల తరువాత చూశారని వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. మీ దూకుడు కట్టిపెట్టకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. ఒకవేళ అలాంటిదే జరిగితే తాము బాధ్యత వహించేది లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై జనసేన సైనికులు చాలా ఆగ్రహంగా ఉన్నారని మండిపడ్డారు. అంతేకాదు “రోడ్డు మీద వెళ్లేటప్పుడు కుక్కలు అరుస్తాయి. కొన్ని పిచ్చికుక్కలు కరుస్తాయి. పిచ్చి కుక్క కరిచిందని మనం కరవం కదా..! మనం ఏం చేస్తాం మున్సిపాలిటీ వ్యాన్ వచ్చే వరకూ వెయిట్ చేసి.., పిచ్చికుక్కల్ని మున్సిపాలిటీ వ్యాన్ లో పడేస్తాం. మీకు మాటిస్తున్నా. మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది. ఆ పిచ్చికుక్కల్ని పట్టుకెళ్తుంది”. అప్పటి వరకూ దయచేసి జనసేన సైనికులు సంయమనం పాటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్.., వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.