- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వనస్థలిపురం: పలు అంశాలకు సంబంధించి కొంతమంది యువతలో మార్పు తేవడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కౌన్సిలింగ్ ఇప్పించడం విన్నాం. కానీ, వీటికి భిన్నంగా ఓ యువకుడు పాదయాత్ర చేస్తూ యువతలో మార్పు రావాలని కోరుతున్నాడు. సిని హీరో పవన్ కల్యాణ్ వీరాభిమాని అయినటువంటి శ్రీకాకుళం జిల్లా సారథి గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ లోని పవన్ ఇంటి వరకు పాదయాత్ర చేస్తున్నాడు.
సమాజం కోసం పాటుపడాలి…
“మార్పు ఓ అవసరం.. అది నిలో వస్తే ఉన్నతి.. నీతో వస్తే ఉద్యమం” అనే నినాదంతో ముందుకు సాగుతున్నాడు. యువకుల్లో ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలంటున్నాడు. మద్యం, ధూమపానం, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సమాజం కోసం పాటుపడాలని కోరుతున్నాడు. ఈరోజు పవన్ నివాసంలో ఆయన్ని కలుస్తానని తెలిపాడు. వనస్థలిపురం పనామా గోడౌన్ వద్ద ఉదయం కనిపించిన అతన్ని వాకాబు చేయగా ఈ విధంగా పేర్కొన్నాడు.