- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: బాలీవుడ్లో విజయవంతమైన చిత్ర నిర్మాతల్లో ఒకరైన సూరజ్ బర్జాత్య.. ప్రేమ కథతో నిండిన కుటుంబ చిత్రాలు తీస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్తో స్నేహం విలువల్ని తెలిపే ఓ కొత్త చిత్రం ‘ఉంచాయి’ని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీలో ప్రధాన పాత్రధారులుగా అమితాబ్బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, పరిణీతి చోప్రా, నీనా గుప్తా, సారిక తదితరులు నటిస్తుండగా.. సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడయాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవలే నేపాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలవగా, నేపాలీ టూరిస్ట్ గైడ్గా పరిణీతి కనిపించనుంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, ఎవరెస్ట్ బేస్కు దగ్గర్లో ఉండే లుక్లా ఎయిర్పోర్ట్లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారని సమాచారం. అలాగే మరికొన్ని సన్నివేశాలను నమ్చేలో తీయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సముద్రమట్టానికి 26,000 అడుగుల ఎత్తులో ఉండే పర్వతశ్రేణుల్లోనూ చిత్రీకరణ చేయనున్నారని చిత్ర వర్గాలు వెల్లడించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘వివాహ్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ లాంటి ఫ్యామిలీ చిత్రాలతో దర్శకనిర్మాత సూరజ్ బర్జాత్య మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.