పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం..

by  |
పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం..
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: రెండేండ్ల వ్యవధితో కూడిన పారామెడికల్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

2020-21 సంవత్సరానికి గానూ జిల్లా పరిధిలోని పారా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు తమ దరఖాస్తు ఫారాలను tspmb.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు. డౌన్‌లోడ్ చేసుకున్న ఫామ్‌లను ఫిల్ చేసి అవసరమైన సర్టిఫికెట్లను జతపరచి నవంబర్ 2వ తేదీ సాయంత్రం 5గంటల లోపు సికింద్రాబాద్‌లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.


Next Story