ఓయో స్ట్రాటజిక్ గ్రూప్ అడ్వైజర్‌గా రజనీష్ కుమార్‌!

by  |
ఓయో స్ట్రాటజిక్ గ్రూప్ అడ్వైజర్‌గా రజనీష్ కుమార్‌!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ఓయో ఐపీఓ రానున్న నేపథ్యంలో కంపీనీ స్ట్రాటజిక్ గ్రూప్ అడ్వైజర్‌గా ఎస్‌బీఅ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్‌ను నియమిస్తున్నట్టు వెల్లడించింది. ఆర్థిక రంగంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న రజనీష్ కుమార్ ఓయో నిర్వహణ కోసం స్వల్ప, దీర్ఘకాల వ్యూహాలు, నియంత్రణ, వాటాదారులతో సంబంధాలు, ప్రపంచవ్యాప్తంగా కంపెనీ బ్రాండ్ మెరుగుపడంలో కీలక పాత్ర పొషిస్తారని ఓయో గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘మొదటి తరం వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ట్రావెల్ పరిశ్రమలో ప్రత్యేక టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.

భారత ఆర్థికవ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్న స్టార్టప్‌ల పట్ల ఆసక్తిగా ఉంది. షేర్ హోల్డర్ల విలువను పెంచేందుకు రితేష్‌తో పాటు అతని బృందంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు’ రజనీష్ కుమార్‌ అన్నారు. ఓయోలో స్ట్రాటజిక్ గ్రూప్ సలహాదారుగా రజనీష్ కుమార్ రావడం సంతోషంగా ఉంది. ఆర్థిక సేవల రంగంలో ఆయన అనుభవజ్ఞుడు. ఆయన నాయకత్వంలో పని చేయడం ప్రేరణగా ఉంటుందని’ ఓయో వ్యవస్థాపకుడు, చైర్మన్ రితేష్ అగర్వాల్ తెలిపారు.


Next Story

Most Viewed