సచివాలయంపై.. బండి వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్ ఎటాక్

by Disha Web Desk 21 |
సచివాలయంపై.. బండి వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్ ఎటాక్
X

దివ,వెబ్‌డెస్క్: సచివాలయం నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా జరిగింది. అయినప్పటికీ ..దాని నిర్మాణం, డిజైన్‌ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఓవైసీ కళ్లలో ఆనందం చూసేందుకే కేసీఆర్ తాజ్‌మహల్‌లా సచివాలయాన్ని కట్టారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. సచివాలయం డిజైన్ హనుమాన్ ఆలయ స్పూర్తితోనే వచ్చిందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సచివాలయంపై గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే…నూతన సచివాలయ డోమ్‌లను కూల్చేస్తామని అన్నారు. నిజాం వారసత్వ సంస్కృతి ధ్వంసం చేస్తామని వ్యాఖ్యానించారు. నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామన్నారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామని గతంలో కామెంట్స్ చేశారు.



Next Story