Operation Sindoor : ఇండియా పాక్ వార్ టైమ్.. ఫేక్ మెసేజ్‌లతో బీ కేర్ ఫుల్!

by Javid Pasha |   ( Updated:2025-05-09 10:19:15.0  )
Operation Sindoor : ఇండియా పాక్ వార్ టైమ్.. ఫేక్ మెసేజ్‌లతో బీ కేర్ ఫుల్!
X

దిశ, ఫీచర్స్ : భారత్‌ పాక్ వార్(India-Pakistan war) నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను, దాడులను ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతోంది. ఇదరు దేశాల సరిహద్దులవద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతోందోనని ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ భావోద్వేగ సమయాన్ని ఆసరగా చేసుకొని సైబర్ నేరస్థులు(Cybercriminals), పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా గ్రూపులు రెచ్చిపోతున్నాయి. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఫోన్లలో ఫలానా సెట్టింగ్‌లు ఆన్ చేసుకోవాలని(Turn on settings), ఏటీఎంలు(ATMs) పనిచేయవని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వీటిని తెలిసో తెలియకో యువత మెసేజ్ ద్వారా పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలర్ట్‌గా ఉండాలని, ఏదీ గుడ్డిగా నమ్మకూడదని భారత రక్షణ శాఖ అధికారులు, పోలీసులు పేర్కొంటున్నారు.

యూపీఐ, బ్యాంక్ ట్రాన్జాక్షన్లు పనిచేయవా?

మూడు రోజులపాటు ఆర్థిక వ్యవస్థ స్తంభిస్తుందని వాట్సాప్‌లో మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయి. అట్లనే రెండు మూడు రోజులు ఏటీఎంలు పనిచేయవని, యూపీఐ, బ్యాంక్ అకౌంట్‌ల నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం కుదరదనే మెసేజ్‌లు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా ఇవన్నీ ఫేక్ మెసేజ్‌లేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, గుడ్డిగా నమ్మకూడదని ప్రజలకు సూచిస్తోంది. అట్లనే అడ్రస్ తెలియని ఈమెయిల్స్ నుంచి, అనుమానిత నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ లింకులను క్లిక్ చేయవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూర్ ఫ్యాక్ట్ చెక్ (Press Information Bureau Fact Check)హెచ్చరించింది.

ఫోన్లో ఆ సెట్టింగ్‌లను ఆన్ చేయండి!?

ఇండియా పాక్ వార్ వివరాలు ఎప్పటికప్పుడు తెలియాలంటే మీ ఫోన్లలో ఫలానా సెట్టింగ్‌లు ఆన్ చేయాలని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే రక్షణశాఖ గానీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గానీ అలాంటి ప్రకటన చేయలేదని గుర్తుంచుకోవాలి. తప్పుడు వార్తలను నమ్మి సెట్టింగ్‌లను ఆన్ చేస్తే సైబర్ నేరస్థులు మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేయవచ్చు. మీ ఫోన్లను హ్యాక్ చేయవచ్చు(Can be hacked). మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేసే తప్పుడు సమాచారంతో తప్పుదారి పట్టించవచ్చు. అందుకే బీ కేర్ ఫుల్ అంటున్నారు నిపుణులు. ఆపరేషన్ సిందూర్ లేదా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇండియణ్ గవర్నమెంట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని గుర్తుంచుకోండి.

పెట్రోల్, డీజిల్ దొరకదిక !?

ఆన్ లైన్ వేదికగా ఇలాంటి ప్రచారం కొనసాగుతోంది. వార్ నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడిందని, వెంటనే వెళ్లి పెట్రోల్, డీజిల్ వంటివి కొనుగోలు చేసి స్టాక్ ఉంచుకోవాలనే పుకార్లు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. కాగా దీనిపై ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (IOCL) క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని(Petrol and diesel reserves are abundant.), కొరత లేదని, ఆందోళన చెందవద్దని పేర్కొన్నది.

Click For Tweet..



Next Story

Most Viewed