- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
మీడియా ఛానల్స్, వెబ్ సైట్లు, ఇతర ప్లాట్ఫారమ్లకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కీలక ఆదేశాలు

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం దాడులకు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. కశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద కేంద్రాలపై దాడి చేసి 100 మందిని హతమార్చింది. కాగా ఈ దాడికి ప్రతికార చర్యగా గురువారం సాయంత్రం పాక్ ఆర్మీ దాడులకు పాల్పడింది. ఈ దాడులను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొని పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. తాజాగా పాకిస్తాన్ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారత్ లోని ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (Ministry of Defense) మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు భద్రతా దళాలకు చెందిన రక్షణ కార్యకలాపాలు, కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆపాలని సూచించింది. యుద్ధానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల భద్రతా దళాల ఆపరేషన్స్కు, వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తెలిపింది. గతంలో కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడులు (26/11), కాందహార్ హైజాకింగ్ వంటి సంఘటనల సమయంలో, నియంత్రణ లేని ప్రసారం జాతీయ ప్రయోజనాల పై అనవసరమైన ప్రతికూల పరిణామాలను కలిగించిందని ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గుర్తు చేసింది.