- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : దేశీయ ఎలక్ట్రానిక్ వాహన మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే బుకింగ్స్ను ప్రారంభించింది. తాజాగా ఈ స్కూటర్ను 10 కలర్ వేరియంట్లలో విడుదల చేయనున్నట్టు గురువారం ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ దీనికి సంబంధించి వివరాలను వెల్లడించారు. సరికొత్త ఓలా ఎలక్త్రిక్ స్కూటర్ నీలం అలాగే ఎరుపు, గులాబీ మరియు పసుపు, తెలుపు మరియు వెండితోపాటు మరికొన్ని రంగులో లభిస్తుందై ఆయన చెప్పారు.
పలు వేరియంట్ల ఎంపికలతో పాటు ఓలా ఈ-స్కూటర్ అన్ని వయసుల వారిని ఆకర్షించేలా ఉంటుందని భవీష్ అగర్వాల్ అన్నారు. ఈ నేలలోనే ఓలా స్కూటర్ లాంచ్ చేసే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 80,000-రూ. 1,00,000 మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది. కాగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఇటీవల సంస్థ రూ. 499తో బుకింగ్స్ని ప్రారంభించింది. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో లక్ష రిజిస్ట్రేషన్లు సాధించింది. ఈ సరికొత్త స్కూటర్ ఇప్పటికే భారత మార్కెట్లో విడుదలైన బజాజ్ చేతక్, ఆథర్ 450 ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వగలదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.