బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు ‘ఈడీ’ షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ

by  |
nora
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ నోరా ఫతేహికి ‘ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్‌’ మనీలాండరింగ్‌ కేసులో తాజాగా నోటీసులు జారీ చేసింది. రూ.200 కోట్ల లంచం కేసులో చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసు నేపథ్యంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించింది. కాగా, ఇప్పటికే ఈ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. 2017 ఎలక్షన్స్‌లో లంచం కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్‌ని విచారించగా పలువురి పేర్లు బ‌య‌ట‌పడ్డాయి. అందులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పేరు కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తీహార్ జైలు లోపల నుంచే దాదాపు రూ. 200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ నడుపుతున్నట్టు చంద్రశేఖర్ పై ఆరోపణలున్నాయి. గతంలో జాక్వెలిన్‌ను ఈ కేసులో ప్రశ్నించిన ఈడీ మొదట ఆమె ప్రమేయం ఉందని భావించింది. ఆ తర్వాత విచారణలో జాక్వెలిన్‌ ఈ కేసులో బాధితురాలిగా అధికారులు తేల్చారు. చంద్రశేఖర్‌ ఆయన భార్య లీనా పాల్ ద్వారా జాక్వెలిన్‌ను మోసం చేశాడని, జాక్వెలిన్‌ తన మొదటి స్టేట్‌మెంట్‌లో ఈడీకి చంద్రశేఖర్ కు సంబంధించిన పలు ముఖ్యమైన సమాచారం అందించిన విషయం తెలిసిందే.


Next Story