వార్నింగ్ ఇచ్చారని.. వారిపై నాన్ బెయిలబుల్ కేసు

by Sridhar Babu |
వార్నింగ్ ఇచ్చారని.. వారిపై నాన్ బెయిలబుల్ కేసు
X

దిశ, ఖమ్మం రూరల్: రూరల్ మండలంలో ఓ రియల్ వ్యాపారిని బెదిరించిన వ్యక్తి పై రూరల్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన ఎటుకూరి సుధాకర్ అనే వ్యక్తి ఈ నెల 29 రాత్రి రియల్ వ్యాపారి షేక్ ఖలిల్‌కు ఫోన్ చేసి బెదిరించారు. అంతే కాకుండా డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మేయిల్ చేయడంతో పాటు, చంపుతామని బెదిరించారు. విషయాన్ని సెటిల్ చేసుకోకపోతే నీ వ్యాపారాన్ని నష్టం చేస్తాం అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ చేసి నాన్ బెయిలబుల్ కేసు‌తో పాటు పలు సెక్షన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ శంకర్ రావు తెలిపారు.



Next Story