‘బ్యాడ్‌ బ్యాయ్ బిలియనీర్స్’కు బ్రేకిచ్చిన కోర్టు..

by  |
‘బ్యాడ్‌ బ్యాయ్ బిలియనీర్స్’కు బ్రేకిచ్చిన కోర్టు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’.. అత్యాశ, మోసం, అవినీతి బేస్ చేసుకుని తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్. ‘విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సత్యం రామలింగరాజు, సహారా సుబ్రతా రాయ్’ లాంటి వ్యక్తుల జీవితకథల ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ప్రసారానికి మళ్లీ ఆటంకం ఏర్పడింది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన సిరీస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది.

ఇంతకు ముందు, ఈ సిరీస్ తన ప్రతిష్టను దెబ్బతీస్తుందని సుబ్రతా రాయ్ బీహార్ దిగువ కోర్టును ఆశ్రయించగా.. సిరీస్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మేము దీనిపై అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసిన కోర్టు.. మరోసారి ఈ విషయం గురించి ఇక్కడకు రాకూడదని స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బీహార్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని సూచించింది.

దీంతో, నెట్‌ఫ్లిక్స్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఈ పిటిషన్ స్వీకరించని ఉన్నత న్యాయస్థానం.. బీహార్ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను ఇచ్చింది. కాగా నెట్‌ఫ్లిక్స్ తరపున సీనియర్ అడ్వకేట్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. సుబ్రతా రాయ్ తరపున వికాస్ సింగ్ వాదించారు.

Next Story

Most Viewed