సెమీ ఫైనల్‌కు ముందు.. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

by  |
New Zealand bowler Trent Bolt
X

దిశ, వెబ్‌డెస్క్: T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తామే గెలుస్తామని న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ ధీమా వ్యక్తం చేశారు. సూపర్ 12 దశలో ఇరు జట్లు కూడా 4 విజయాలతో మంచి ఫామ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టులో గాయాల కారణంగా ఓపెనర్ జేసన్ రాయ్, బౌలర్ టైమల్ మిల్స్ కీలక మ్యాచులకు దూరమయ్యారు. అయినా, ప్రస్తుతం కెప్టెన్ మోర్గాన్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగానే ఉందని బోల్ట్ అన్నాడు.

తాము మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో కాస్త తడపడ్డామని, కానీ తరువాత వరుస విజయాలతో పట్టుదలతో ఉన్నామని, ఈ మ్యాచ్ గురించి అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నారు. పక్కా మ్యాచ్ మేమే గెలుస్తామని బోల్ట్ పేర్కొన్నాడు. అయితే, నవంబర్ 10న ఫైనల్ బెర్త్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది.


Next Story

Most Viewed