- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరిగిన పదవి స్వీకార ప్రమాణోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలను గజమాలతో సత్కరించి, భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులు కవిత, ఉపాధ్యక్షులు వెలగపూడి గోపాల్, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వర్ని మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
Next Story