కేటీఆర్‌పై కొండా కీలక వ్యాఖ్యలు.. నిజమేనంటున్న నెటిజన్లు

by  |
కేటీఆర్‌పై కొండా కీలక వ్యాఖ్యలు.. నిజమేనంటున్న నెటిజన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తుంటారు. అంతేకాకుండా, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుంటారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్‌పై గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కేటీఆర్ అక్టోబర్‌ 5 న చేసిన ట్వీట్‌ను కొండా రీట్వీట్ చేస్తూ ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

కేటీఆర్ చేసిన ట్వీట్ ‘‘Shocked & Horrified to see the ruthless & cold blooded murder of farmers in #Lakhimpur_Kheri of Uttar Pradesh. Strongly condemn the barbaric incident & hope the perpetrators will be brought to justice soonest’’ అని చేశారు. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ కేరీ ఘటన చూసి తాను షాక్ కి గురయ్యానని, నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని ట్వీట్ చేశారు.

దీనిని రీట్వీట్ చేస్తూ.. ‘‘ He is shocked by a crime in UP. But ignores the rape of an ST child in his own Constituency Sircilla by his own pointsman. It requires thick skin.’’ అని చేశారు. కేటీఆర్ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన చూసి షాక్ అయ్యారు. కానీ, సొంత నియోజకవర్గంలో తన పార్టీకి చెందిన వ్యక్తి ఎస్టీ చిన్నారిపై అత్యాచారం చేస్తే కనిపించదు అని ట్వీట్ చేస్తూ తీవ్రంగా విమర్శించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొండా ఆరోపణ నిజమేనంటూ కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed