సున్నాకు సున్నా కలిపితే ఎంతో.. కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనమైనా అంతే : సంజయ్ నిరుపమ్

by Dishanational6 |
సున్నాకు సున్నా కలిపితే ఎంతో.. కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనమైనా అంతే : సంజయ్ నిరుపమ్
X

దిశ, నేషనల్ బ్యూరో: శరద్ పవార్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేత సంజయ్ నిరుపమ్. శరద్ పవార్ తన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు. సున్నాకు సున్నా కలిపితే శూన్యమే వస్తుందని ఆ రెండు పార్టీలను ఎద్దేవా చేశారు. నిరుపమ్ సంజయ్ ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఏక్ నాథ్ శిండే వర్గంలో చేరారు.

అయితే, 2024 ఎన్నికల తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమో లేదా వీలినం చేయడమో చేస్తాయని శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్ చేసిన ప్రకటనపైనే ఈ విధంగా స్పందించారు సంజయ్ నిరుపమ్. తన సొంత కోరికను ఈ వ్యాఖ్యల ద్వారా తెలియజేశారని విమర్శించారు.

చాలా ఏళ్ల క్రితమే శరద్ పవార్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకున్నారని అన్నారు. ఈ రహస్యాన్ని తానే బయటపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీని విలీనం చేయాలకున్న శరద్ పవార్ కి అసలైన అడ్డంకి ఆయన కూతురని అన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధినేతగా సుప్రియా సూలేని చూడాలనుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ లో ఎన్సీపీని విలీనం చేసినా.. సున్నాకు సున్నా కలిపితే శూన్యమే అని అన్నారు.

Next Story