మసీదు తరహా బస్టాండ్‌ను కూల్చివేస్తాం.. బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు

by Disha Web Desk 21 |
మసీదు తరహా బస్టాండ్‌ను కూల్చివేస్తాం.. బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు
X

బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూరు-ఊటీ రహదారిపై నిర్మించిన మసీదు తరహా బస్టాండ్‌ను కూల్చివేస్తానని అన్నారు. 'నేను దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చూశాను. బస్టాండ్‌పై రెండు చిన్న గోపురాలు మధ్యలో పెద్ద గోపురం ఉంది. అది మసీదు తరహా నిర్మాణం మాత్రమే' అని పేర్కొన్నారు.

దీనిని మూడు-నాలుగు రోజుల్లో కూల్చివేయాలని ఇంజనీర్లను ఆదేశించానని, వారు చేయకపోతే తానే బుల్డోజర్ తీసుకెళ్తానని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. మైసూరు ఎంపీ మూర్ఖపు వ్యాఖ్యలు చేశారని విమర్శించింది. గోపురం ఉందని, ప్రభుత్వ ఆఫీసులను కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించింది. కాగా, ఈ బీజేపీ ఎంపీ హిజాబ్ వివాదం సమయంలోనూ తన వ్యాఖ్యలతో చర్చల్లో నిలిచారు.


Next Story

Most Viewed