- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ మాజీ మంత్రి ఆర్యదన్ ముహమ్మద్ కన్నుమూత
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్యదన్ ముహమ్మద్ (87 ఏళ్లు) ఆదివారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన కోజికోడ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని ముహమ్మద్ కుటుంబసభ్యులు అధికారికంగా తెలియజేశారు. నేడు (సోమవారం) అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ముహమ్మద్ మృతిపై రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. ముహమ్మద్ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని పేర్కొన్నారు. కాగా, ముహమ్మద్.. 1935 మే 15న కేరళలోని నీలాంబర్లో జన్మించారు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. 1952లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యుడిగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నీలాంబర్ నియోజకవర్గం నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే మూడుసార్లు మంత్రిగా కూడా పని చేశారు.