వాట్సాప్ చానెల్‌లో ప్రధాని మోడీ.. మొదటి పోస్ట్ ఇదే

by Mahesh |
వాట్సాప్ చానెల్‌లో ప్రధాని మోడీ.. మొదటి పోస్ట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని సోషల్ మీడియాలో కోట్లలో ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ న్యూస్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రముఖుల నుంచి సాధారణ యూజర్స్ వరకు తమ వ్యక్తిగత చానెల్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ప్రధాని మోదీ ఈరోజు వాట్సాప్ ఛానెల్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకొగా గంటల వ్యవధిలోనే 30k ఫాలోవర్స్ అయ్యారు. అయితే భారత ప్రధాని మోడీ నూతన పార్లమెంట్‌లోని తన వాట్సాప్ చానెల్ లో మొట్టమొదటి పోస్ట్ పెట్టారు. తన ఛాంబర్ లో కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆయన.. దానికి వాట్సాప్ సంఘం లో చేరడం ఆనందంగా ఉంది! మా నిరంతర పరస్పర చర్యల ప్రయాణంలో ఇది మరో అడుగు దగ్గరగా ఉంది. ఇక్కడ కనెక్ట్ అయి ఉండనివ్వండని రాసుకొచ్చారు.



Next Story

Most Viewed