గాంధీని చంపారు.. నన్ను వదిలేస్తారా: మాజీ సీఎం

by Dishanational4 |
గాంధీని చంపారు.. నన్ను వదిలేస్తారా: మాజీ సీఎం
X

బెంగళూరు: గాంధీని చంపారు.. నన్ను వదిలేస్తారా? అని కర్ణాటక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధ రామయ్య ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల తీరుపై మండిపడ్డారు. గురువారం బీజేపీ కార్యకర్తలు సిద్ధ రామయ్య వెళ్తున్న కారుపై కోడిగుడ్డుతో దాడి చేసిన ఘటనపై శుక్రవారం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'వీళ్లు గాంధీని చంపారు. నన్ను వదిలేస్తారా? గాంధీని కాల్చిన గాడ్సే ఫోటోలను వీళ్లు రోజూ పూజిస్తున్నారు. తనపై భద్రతా ముప్పు పొంచి ఉంది.' అని ఆరోపించారు. అయితే ఈ విషయంపై కర్ణాటక హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్పందించారు.

'బీజేపీ కార్యకర్తలకు నిరసనకు అనుమతి ఉంది. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించం. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చాము. సిద్ధరామయ్యకు తగిన భద్రతను కల్పించడానికి ఆదేశాలు జారీ చేశాం' అని అన్నారు. అయితే రాజకీయ లబ్ధి కోసమే సిద్ధ రామయ్య ఇలాంటి ఆరోపణ చేస్తున్నారని, ఆయనపై ఎవరూ దాడి చేయరని ఆరగ జ్ఞానంద్ర పేర్కొన్నారు. కాగా, మడికేరిలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ సీఎం సిద్దరామయ్య బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సిద్ధ రామయ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే కొందరు బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లతో సిద్ధ రామయ్య కారుపై దాడులకు దిగారు. దీంతో కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఉధ్రిక్త వాతావరణం నెలకొంది.


Next Story

Most Viewed