ప్రపంచ జనాభా 800 కోట్లు.. జనాభాలో భారత్ నెం.1

by Sathputhe Rajesh |
ప్రపంచ జనాభా 800 కోట్లు.. జనాభాలో భారత్ నెం.1
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ జనాభా నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరుకోనున్నట్లు ఐరాస ప్రకటించింది. ఐరాస అంచనాల ప్రకారం 2023లో భారత్ జనాభాలో చైనాను అధిగమించి అత్యంత జనాభా కలిగిన దేశంగా ఆవిర్భవించనుంది. ప్రస్తుతం మన దేశంలో 141.2 కోట్ల జనాభా ఉన్నారు. 2050 నాటి 170 కోట్లకు చేరనున్నట్లు ఐరాస ప్రకటించింది. 2050 నాటికి చైనా జనాభా 130 కోట్లకు తగ్గనుంది. జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన చైనా ఈ శతాబ్ధం చివరి నాటికి 80 కోట్లకు చేరుకోవచ్చని ఐరాస తెలిపింది. కాగా ప్రపంచ జనాభా 48 ఏళ్లలో రెట్టింపయింది. క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల ప్రాంతంలో ప్రపంచ జనాభా దాదాపు 50లక్షలుగా ఉందని అంచనా. క్రీస్తు శకం 1వ శతాబ్ధం నాటికి అది 20 కోట్లకు చేరింది. 2050 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లు అవుతుందని అంచనా వేసిన ఐరాస 2080లో ఈ మొత్తం 1040 కోట్లకు చేరునున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed