- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిగ్విజయ్ సింగ్ సిగ్గుపడాలి: సుశీల్ కుమార్ మోడీ ఫైర్
by Disha Web Desk 21 |
X
న్యూఢిల్లీ: బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ను తీవ్రంగా విమర్శించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను ఆరెస్సెస్తో దిగ్విజయ్ సింగ్ పోల్చడాన్ని తప్పు బట్టారు. ఇలాంటి చర్యలతో ఆయన సిగ్గుపడాలని అన్నారు. అంతకుముందు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ పీఎఫ్ఐ, ఆరెస్సెస్లు రెండు ఒకే తరహాకు చెందినవని సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తున్న అన్నింటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
తాజాగా కేంద్ర సంస్థలు ఈడీ, ఎన్ఐఏలు పీఎఫ్ఐ కార్యాలయాలపై దాడులను ఉద్దేశించి.. ఇప్పటివరకు ఆరెస్సెస్, విశ్వహిందు పరిషత్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఈ నెల 22న అర్థరాత్రి దేశవ్యాప్తంగా 100కు పైగా పీఎఫ్ఐ కార్యాలయాల్లో ఈడీ, పీఎఫ్ఐ సోదాలు చేపట్టగా.. కార్యకర్తలు, వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.
Next Story