ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ప్రైజ్‌ను గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త

by Harish |
ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ప్రైజ్‌ను గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖగోళ శాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు గాను, భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్. కులకర్ణి ప్రతిష్టాత్మక షా ప్రైజ్‌ను అందుకున్నారు. మిల్లీసెకన్ల పల్సర్‌లు, గామా-రే పేలుళ్లు, సూపర్‌నోవాలు, ఇతర వేరియబుల్/ట్రాన్సియెంట్ ఖగోళ వస్తువుల గురించి కులకర్ణి చేసిన సంచలనాత్మక ఆవిష్కరణలకు గుర్తింపుగా ఈ ప్రైజ్‌ను అందించినట్లు షా ప్రైజ్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖగోళ శాస్త్రం, ప్లానెటరీ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ విభాగానికి ప్రొఫెసర్‌గా జార్జ్ ఎలెరీ హేల్ ఉన్నారు. షా ప్రైజ్ ఫౌండేషన్ టైమ్-డొమైన్ ఖగోళ శాస్త్రానికి కులకర్ణి చేసిన కృషిని ప్రశంసించింది.

కులకర్ణి 4 అక్టోబర్ 1956న మహారాష్ట్రలోని కురుంద్‌వాడ్ అనే పట్టణంలోజన్మించారు. 1978లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేసిన తరువాత, 1983లో యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి Ph.D చేశారు. కులకర్ణి 2006 నుండి 2018 వరకు కాల్టెక్ ఆప్టికల్ అబ్జర్వేటరీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయనతో పాటు, 2024 షా ప్రైజ్ అందుకున్న వారిలో లైఫ్ సైన్స్, మెడిసిన్‌లో యునైటెడ్ స్టేట్స్ నుండి స్వీ లే థీన్, స్టువర్ట్ ఓర్కిన్, గణిత శాస్త్రంలో పీటర్ సర్నాక్ ఉన్నారు. దివంగత హాంకాంగ్‌కు చెందిన రన్ రన్ షా స్థాపించిన షా ప్రైజ్ ఖగోళ శాస్త్రం, లైఫ్ సైన్స్, మెడిసిన్, మ్యాథమెటికల్ సైన్సెస్‌లో మూడు వార్షిక బహుమతులను కలిగి ఉంది, ప్రతి ఒక్కటి $1.2 మిలియన్ల ఫ్రైజ్ మనీని అందిస్తుంది.

Next Story

Most Viewed