మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత

by Disha Web Desk 6 |
మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: బిహార్‌లోని ఫర్‌బిస్‌గంజ్ సబ్‌డివిజన్ అరారి జిల్లాలోని ఓ పాఠశాలలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం కిచిడిలో పాము పిల్ల రావడంతో అది తిన్న 25 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అది గమనించిన పాఠశాల సిబ్బంది వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భోజనం పాఠశాలలో వండలేదని ఓ కాంట్రాక్లర్ సరఫరా చేసినట్లు సిబ్బంది చేబుతున్నారు. తమ పిల్లలను చదువుకోవడానికి పంపితే వారిని అలాంటి పరిస్థితుల్లో చూసిన చిన్నారుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.


Next Story

Most Viewed