- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షాకింగ్ వీడియో.. టోల్ ప్లాజా ఉద్యోగిపై మహిళ దౌర్జన్యం.. ఎందుకంటే?

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ హైవేలపై ఉండే టోల్ ప్లాజాల (Toll plaza) వద్ద టోల్ ఫీజు చెల్లించిన తర్వాతే వాహనాలను అనుమతిస్తారని తెలిసిందే. వాహనదారులకు టోల్ చెల్లింపు సులభతరం చేసేందుకు కేంద్ర ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే, తాజాగా యూపీలో (Uttarpradesh) ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోల్ రుసుము చెల్లించమని అడిగినందుకు ఓ మహిళ సిబ్బందిపై దాడికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
హావూర్ జిల్లాలోని చిజార్సి టోల్ ప్లాజా వద్దకు ఓ కారు వచ్చి ఆగింది. అయితే, ఆ కారు ఫాస్టాగ్ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవటంతో టోల్ ఫీజు చెల్లించాలని టోల్ ప్లాజా సిబ్బంది అడిగారు. దీంతో ఆ వాహనంలోని మహిళ దిగి వచ్చి.. టోల్ ప్లాజా క్యాబిన్లోకి వెళ్లి ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ హఠాత్ పరిణామనికి ఈ ఉద్యోగి కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇతర సిబ్బంది వచ్చి ఆమెను ఆపే ప్రయత్నించినా.. ఆమె కోపంతో చెలరేగిపోయింది. సదరు మహిళ ఘజియాబాద్ నుంచి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం వైరల్గా మారాయి. ఈ దాడికి పాల్పడిన మహిళపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.