ఈ వినాయకుడి విగ్రహం విలువ రూ.35 కోట్ల కంటే ఎక్కువే.. ఈ విగ్రహం ఎక్కడుందో తెలుసా..?

by Disha Web Desk 12 |
ఈ వినాయకుడి విగ్రహం విలువ రూ.35 కోట్ల కంటే ఎక్కువే.. ఈ విగ్రహం ఎక్కడుందో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 18 నుంచి వినాయక చవితి ప్రారంభం అయింది. ఊరు వాడ ఒక్కటై గణపతి మండపాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా సంబురాలు ప్రారంభించారు. అయితే ఇన్ని రోజులు గణేషుడి విగ్రహాన్ని ఎత్తు గురించి చర్చించే వాళ్లము. కానీ మొదటి సారి ఈ అత్యంత ధనవంతుడైన వినాయకుని గురించి సోషల్ మీడియాలో చర్చలు వైరల్ గా మారాయి. ముంబైలోని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ వారి ఆధ్వర్యంలో రిచేస్ట్ వినాయకుడిని ఏర్పాటు చేశారు. వారు విగ్రహంలో 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలతో వినాయక విగ్రహం తయారు చేశారు. అంటే వాటి విలువ సుమారు 38,36,67,531 ఉండనుంది. కాగా గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ వారు ఈ వినాయకుడికి 360.45 కోట్ల బీమా కవరేజీని తీసుకుంది. అలాగే ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి.. భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు మీడియాతో తెలిపారు.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story

Most Viewed