- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
580కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయి
by Disha Web Desk 7 |
X
లక్నో: ఓ కేసు విచారణలో భాగంగా పట్టుబడిన గంజాయిని అప్పగించాలన్న యూపీలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలకు మధుర పోలీసులు ఆశ్చర్యకర సమాధానం ఇచ్చారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న 581 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని పేర్కొంటూ, స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (1985) కోర్టుకు నివేదిక సమర్పించారు. తమకు పట్టుబడిన మత్తు పదార్థాలను మధుర పట్టణంలోని షేర్గఢ్ పోలీస్ స్టేషన్లో 386కిలోలు నిల్వ చేయగా, హైవే పోలీస్ స్టేషన్లో 195 కిలోలు నిల్వ చేశామని, అయితే ఈ మొత్తం గంజాయినీ ఎలుకలు తిన్నాయని పేర్కొన్నారు. వీరి నివేదికపై స్పందించిన ప్రత్యేక కోర్టు.. శనివారంలోగా అందుకు తగిన ఆధారాలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాగా, ఎలుకలు తిన్నాయని చెబుతున్న గంజాయి విలువ సుమారు రూ.60లక్షలు కావడం గమనార్హం.
Next Story