- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రత్యేక సమావేశం కోసం ప్రధాని మోడీకి లేఖ రాసిన రాహుల్ గాంధీ

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 22న కశ్మీర్ లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి (terrorist attack)ని భారత దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో దాడిని ఖండిస్తూ.. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యలకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉగ్రవాద దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాహుల్ తన లేఖ(letter)లో.. ఈ క్లిష్ట సమయంలో దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైనట్టు చూపించేందుకు ప్రత్యేక సమావేశం అవసరమని పేర్కొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఏప్రిల్ 28 రాత్రి ప్రధానమంత్రికి లేఖ రాసి, పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఏకమైన తీరును చూపించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశం ద్వారా జాతీయ ఐక్యతను ప్రదర్శించవచ్చని, ఉగ్రవాదంపై సమిష్టి నిబద్ధతను చూపవచ్చని పేర్కొన్నారు. వీరితో పాటుగా ఆర్జేడీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మనోజ్ కుమార్ ఝా (Manoj Kumar Jha) ప్రధానికి లేఖ రాసి.. జాతీయ ఐక్యత, పౌర భద్రత సవాళ్లను చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. మరీ ఈ లేఖలపై ప్రధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.