కాంగ్రెస్ క్యాంపెయిన్ షురూ చేయనున్న ప్రియాంక గాంధీ..

by Dishafeatures2 |
కాంగ్రెస్ క్యాంపెయిన్ షురూ చేయనున్న ప్రియాంక గాంధీ..
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా రానున్న ఎన్నికల్లో పార్టీ తరపున క్యాంపెయిన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక సొలాన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ అక్టోబర్ 10 నుంచి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ కోటగా పిలవబడే సొలాన్‌లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ కోటను సంరక్షించే బాధ్యతలను ప్రియాంక చేపట్టనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో వీరభద్రసింగ్ లేకుండా జరుగుతన్న తొలి ఎన్నికలు కానందున వీటిలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సారిహిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి తప్పకుండా వస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం సత్తా చాటుతుందో చూడాలని చర్చలు జరుగుతున్నాయి.


Next Story

Most Viewed